'పథకాల అమల్లో అధికార పార్టీ నేతల జోక్యం ఏమిటి?'.. బీజేపీ నేతల నిరసన

by Vinod kumar |
పథకాల అమల్లో అధికార పార్టీ నేతల జోక్యం ఏమిటి?.. బీజేపీ నేతల నిరసన
X

దిశ, నూతనకల్: గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు లో జరిగిన అక్రమాలకు నిరసనగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అధికార పార్టీ నేతల జోక్యం ఏమిటని, దీంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోగా అనర్హులకు లబ్ధి చేకూరుతుందని, కమిషన్లకు కక్కుర్తి పడి పథకాలను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు.

గృహలక్ష్మి, దళిత బంధు అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం కన్వీనర్ కాప రవి, బీజేపీ మండల అధ్యక్షుడు మద్ది సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిలు బోల్క కుమార్, కొమ్ము పరమేష్, సోషల్ మీడియా కన్వీనర్ బ్రాహ్మండ్లపల్లి మధు, సాగర్ ,వెంకట మల్లు, వెంకన్న, నాగయ్య, వెంకటేశ్వర్లు, గోపి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story