మిర్యాలగూడలో 35 లక్షల విలువైన గంజాయి పట్టివేత!

by Anjali |
మిర్యాలగూడలో 35 లక్షల విలువైన గంజాయి పట్టివేత!
X

దిశ, వెబ్‌డెస్క్: వాహనంలో 140 కిలోల గంజాయిని తరలిస్తోన్న వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. మిర్యాలగూడ నెల్లిమెట్ల జంక్షన్ వద్ద రూరల్ ఎస్సై ధనుంజనాయుడు, సిబ్బంది వాహన తనిఖీలు జరిపారు. చింతపల్లి వైపు నుంచి కేరళ రిజిస్ట్రేషన్ కు చెందిన బెలినో కారును చూసి అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తనిఖీ చేశారు. దీంతో భారీగా గంజాయి బయటపడింది. కారులో సుమారు 35 లక్షల విలువైన 140 కిలోల గంజాయి బస్తాలు ఉన్నాయి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 27 ఏళ్ల అరుణ్, రేంజు(42), ఆనంద్(23), కొర్ర అర్జున్‌లను అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. నిందితుల నుంచి 140 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed