తహసీల్దార్‌ను సత్కరించిన గవర్నర్

by Naveena |   ( Updated:2024-10-18 13:27:34.0  )
తహసీల్దార్‌ను సత్కరించిన గవర్నర్
X

దిశ, అర్వపల్లి : ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాజిరెడ్డిగూడెం మండల తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులుకు మెమొంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో ప్రజాసేవ, విధి నిర్వహణ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారన్నారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని తహశీల్దారు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed