ఏఈఈ జాబ్ కొట్టిన రైతుబిడ్డ

by Nagam Mallesh |
ఏఈఈ జాబ్ కొట్టిన రైతుబిడ్డ
X

దిశ, మాడుగులపల్లిః మాడుగులపల్లి మండలం మర్రిగూడెం గ్రామం చెందిన మండల దుర్గయ్య వెంకటమ్మల మొదటి కుమారుడు మండల శివ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీరింగ్ గా పని చేస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఏఈఈ గా అర్హత సాధించారు. వీరి యొక్క తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతుంటారు. మండల శివ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు మాడుగుపల్లి మండల కేంద్రంలో గల నవోదయ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ గౌతమీ జూనియర్ కళాశాల నల్గొండలో పూర్తిచేసుకుని బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో పూర్తి చేశారు. రెండవ కుమార్ ఓంకార్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. తన పెద్ద కుమారుడు రెండు ఉద్యోగాలకు గాను అర్హత సాధించిన సందర్భంగా తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed