చావు బతుకుల మధ్య ఉన్న చెల్లికి కాలేయం దానం చేసిన అక్క

by Mahesh |
చావు బతుకుల మధ్య ఉన్న చెల్లికి కాలేయం దానం చేసిన అక్క
X

దిశ, నూతనకల్: కాలేయ వ్యాధితో చావు బతుకుల మధ్య ఉన్న తన తోడబుట్టిన చెల్లికి కాలేయం దానం చేసి ఓ అక్క పునర్జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన మిర్యాల భవాని భర్త శోభన్ బాబు కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుర్లతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల కామెర్ల వ్యాధితో భవాని కాలేయం పాడవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా డాక్టర్లు పలు పరీక్షలు చేసి కాలేయం మార్పిడికి సూచించారు.

దీంతో చిల్పకుంట్ల గ్రామానికి చెందిన భవాని (అక్క) బత్తుల సరిత కాలేయం ఇచ్చేందుకు ముందుకు వచ్చి చెల్లికి ప్రాణదానం చేసింది. సర్జరీ అనంతరం కోలుకుంటున్న భవానిని వైద్యులు పరీక్షించడం తో పాటు సరితను అభినందించారు. అయితే ఇప్పటికే 20 లక్షలు ఖర్చు అయ్యాయని, ఇంకా 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారని భవాని భర్త శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఖర్చు భరించలేని స్థాయిలో ఉన్న మాకు అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నామని.. ఎంతో కొంత తోచినంత కింది నెంబర్ 8498972836 కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం చేసి మమ్మల్ని కాపాడాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed