- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
By election: యూపీ బైపోల్స్లో కాంగ్రెస్కు 2 సీట్లు.. ఎస్పీ నేత రాజేంద్ర చౌదరి!
దిశ, నేషనల్ బ్యూరో: యూపీలో ఉప ఎన్నికలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం జరిగినట్టు తెలుస్తోంది. ఘజియాబాద్, ఖైర్ సీటులో కాంగ్రెస్ పోటీ చేయనుండగా.. మిగిలిన 8 స్థానాల్లో ఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరించలేదని సమాచారం. తమకు 5 సీట్లు కావాలని పట్టుబట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఘజియాబాద్, ఖైర్, మీరాపూర్, మంజ్వాన్, ఫుల్పూర్ సెగ్మెంట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మాట్లాడుతూ.. మేము 5 సీట్ల డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు సీట్ల కేటాయింపుపై తమకు సమాచారం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ముజఫర్నగర్లోని మీరాపూర్తో సహా ఏడు స్థానాలకు ఎస్పీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది, అక్కడ నుండి సుంభుల్ రాణాను బరిలోకి దింపింది. అయితే ఈ సీటును కాంగ్రెస్ కోరుకోవడం గమనార్హం. దీంతో బై పోల్స్ విషయంలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. కాగా, యూపీలోని 10 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.