'డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది'

by Vinod kumar |
డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): తొమ్మిదిన్నర ఏళ్లుగా ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఇవ్వకుండా మభ్యపెట్టి మోసం చేసిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పాలకవీడు మండలంలోని ఎల్లాపురం గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తీగల శేసిరెడ్డి తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో ఆయన సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి అనేక వాగ్దానాలు చేశారని కానీ, ఒక్క వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదని అందుకే ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే దోపిడీ చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆ దోపిడీ వ్యవస్థను అంతం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని దీమా వ్యక్తం చేశారు.


వచ్చే ఎన్నికలలో పాలకవీడు మండలం నుండి 10 వేల మెజార్టీ రాబోతుందని తెలిపారు. నేటి నుండి ఎన్నికల ప్రచారం మొదలైందని 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, నాయకులు మాలోతు మోతిలాల్ బైరెడ్డి, జితేందర్, నాగిరెడ్డి, బెల్లంకొండ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story