- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLA : బఫర్ జోన్ బాధితులకు అండగా ఉంటా
దిశ, సూర్యాపేట : సద్దుల చెరువు పరిసర ప్రాంతాలలో ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటూ, నేడు బాధితులైన వారందరికీ తాను అండగా ఉంటానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో బాధిత 42,43 వార్డులలో పర్యటించి మాట్లాడారు. పేదవాళ్లు రూపాయి రూపాయి వెనకేసుకుని గుడిసెలలో ఉంటూ వాళ్ళు సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. పేదవాళ్లు ఇల్లు కూలగొడుతుంటే తామూ చూస్తూ ఊరుకోమన్నారు. ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లేనని, మళ్లీ అదే ప్రభుత్వం వచ్చి ఇళ్లను కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకుని, మున్సిపల్ నల్లా కలెక్షన్లు పెట్టించుకుని, రోడ్లు వేయించుకొని ఒక వీధిని ఏర్పాటు చేసుకున్న వాళ్లను రోడ్డున పడేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. వెయ్యి కోట్ల ప్రజల ఆస్తి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారితో మాట్లాడి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, నాయకులు గండూరి ప్రకాష్, సంజీవ్ నాయక్, అంగిరేకుల నాగార్జున, గాలి సాయి, భాష, జహీర్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.