సీఎం చంద్రబాబు బొమ్మ గీసిన టాలీవుడ్ హీరో.. ఆ ఫొటోలు వైరల్!

by Jakkula Mamatha |
సీఎం చంద్రబాబు బొమ్మ గీసిన టాలీవుడ్ హీరో.. ఆ ఫొటోలు వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబును(CM Chandrababu) ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు హీరో మంచు విష్ణు నిన్న(శుక్రవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం సీఎం చంద్రబాబుకు విరాళంగా రూ. 25 లక్షల చెక్కును అందించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇవాళ (శనివారం) మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసే భాగ్యం దక్కింది. ఏపీలో వరద బాధితుల రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల చెక్ అందించాం. కన్నప్ప చిత్ర విశేషాలతో పాటు, ఇంకా అనేక సంగతులు చంద్రబాబు గారితో మాట్లాడాం. నేను గీసిన ఆయన బొమ్మపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు గారికి మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను" అంటూ మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed