Mahesh Kumar Goud: అప్పుడు న్యాయం చేయలేకపోయాం.. స్థానిక ఎన్నికల్లో మీకే ప్రయార్టీ: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |
Mahesh Kumar Goud: అప్పుడు న్యాయం చేయలేకపోయాం.. స్థానిక ఎన్నికల్లో మీకే ప్రయార్టీ: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవలే రాష్ట్ర పీసీసీ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే పీసీసీ కార్యవర్గంగా పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే కొత్త కార్యవర్గం ప్రకటిస్తామన్నారు. త్వరలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు. పీసీసీ కార్యవర్గం తర్వాత డీసీసీ అధ్యక్షుల అంశాన్ని గురించి చర్చిస్తామన్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వలేకపోయామని అప్పుడు గెలుపే లక్ష్యంగా పని చేశామన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు బీసీలకు న్యాయం చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed