- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : చామల కిరణ్ కుమార్ రెడ్డి
దిశ, ఆత్మకూరు(ఎం) : తనను ఆశీర్వదిస్తే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, నిరంకుశ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. తనని గెలిపిస్తే ఈ ప్రాంత రైతాంగం సమస్యల్ని ఢిల్లీలో వినిపిస్తానని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అన్నదమ్ముల్లాగా కలిసి పని చేస్తామన్నారు. యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, జెడ్పిటిసి నరేందర్ గుప్తా, ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం, పిఎసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, సిద్ధులు, హనుమంతు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.