ప్రజావాణికి వినతుల వెల్లువ...

by Kalyani |
ప్రజావాణికి వినతుల వెల్లువ...
X

దిశ,చింతపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు చింతపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజల నుంచి ముమ్మరంగా సమస్యల వినతులు అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ధరణి, రేషన్ కార్డులు, గృహ జ్యోతి, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పింఛన్లు భూ సమస్యలపై పెద్ద ఎత్తున వినతులు అందాయి.

ఈ సందర్భంగా అధికారులు వివిధ గ్రామాల ప్రజలు ఇచ్చిన సమస్యలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి జిల్లా సంక్షేమశాఖ అధికారి, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్ విజయ్ కుమార్, ఆర్ ఐ యాదగిరి ఎంపీవో ప్రవీణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అనిల్, సర్వేయర్ రతన్లాల్, ఐ సి డి ఎస్ అధికారిని జ్ఞానేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed