అక్రమ మద్యం స్వాధీనం..వ్యక్తిపై కేసు నమోదు

by Naveena |
అక్రమ మద్యం స్వాధీనం..వ్యక్తిపై కేసు నమోదు
X

దిశ, మర్రిగూడ : అక్రమంగా కిరాణా షాపులో మద్యం అమ్ముతూ ఓ వ్యక్తి పట్టుబడిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐకే రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని దామెర భీమన పళ్లి గ్రామంలో కిరాణం షాపు ముసుగులో ఐతరాజు పాపయ్య అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కిరాణం షాపును రైడ్ చేశారు. ఈ క్రమంలో నిల్వ ఉన్న ఇంపీరియల్ బ్లూ మద్యం సీసాలను 12 బీర్లను స్వాధీనం చేసుకుని పాపయ్య పై కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story