ముస్లింలు బలవంతంగా మతమార్పిడి చేశారు : గవర్నర్ కు నారాయణరెడ్డి విజ్ఞప్తి

by M.Rajitha |
ముస్లింలు బలవంతంగా మతమార్పిడి చేశారు : గవర్నర్ కు నారాయణరెడ్డి విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రజాకార్లు హిందువులను బలవంతంగా మతమార్పిడి చేపట్టారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి మండిపడ్డారు. నిజాం సైన్యం ఎందరో మహిళలను చెరిపేశారని, నగ్నంగా బతుకమ్మ ఆడిపించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలన్నీ తాను నిర్మాతగా వ్యవహరించిన ‘రజాకార్’ సినిమాలో చిత్రీకరించామని, వీక్షించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆయన కలిశారు. కాగా రజాకార్ సినిమా తీయడంపై గవర్నర్ తనకు అభినందనలు తెలిపారని గూడూరు వెల్లడించారు. ఇదిలా ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఖాసీం రజ్వీ మెడలు వంచి హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేశారన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై నారాయణ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed