అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. Group-2, 3 పరీక్షల వాయిదాపై MP మల్లు రవి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-07-19 12:07:28.0  )
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. Group-2, 3 పరీక్షల వాయిదాపై MP మల్లు రవి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి కీలక ప్రకటన చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణను పోస్ట్‌పోన్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రకటించారు. కాగా, వచ్చే నెలలో జరగనున్న గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేయడంతో పాటు గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులు.. ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నిరుద్యోగులతో ప్రభుత్వం తరుఫున సీనియర్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ చర్చలు జరిపారు.

అభ్యర్థులతో చర్చలు ముగిసిన అనంతరం మల్లు రవి మీడియాత మాట్లాడుతూ.. గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తుందని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు అనంతరం నిరుద్యోగులు మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేసేందుకు ప్రభుత్వం ఒకే చెప్పిందని తెలిపారు. డిసెంబర్‌ నెలలో గ్రూప్-2 నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. గ్రూప్-2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed