MP Elections : నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

by Disha Web Desk 4 |
MP Elections : నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు రాహుల్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, 6 గంటలకు సరూర్ నగర్ స్డేడియంలో నిర్వహించే సభలకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed