- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై మోడీ వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్డెస్క్: ఎన్డీఏ ముఖ్యనేతలు, ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లగా జాతీయ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు అయిందని అయితే అనతికాలంలోనే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మహారాష్ట్ర, యూపీలో అధికారంలో ఉన్నా.. ఎంపీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు బీజేపీని అదరించలేదన్నారు. అయితే తెలంగాణలో గతంలో 4 ఎంపీ స్థానాలు ఉంటే 8కి చేరుకున్నారని.. 3 ఎమ్మెల్యేల నుంచి 8కి చేరుకున్నారని గుర్తుచేశారు. మాకు 64 అసెంబ్లీ స్థానాలు రాగా ఉపఎన్నికలో గెలుపుతో 65కు మా బలం చేరిందన్నారు. పూర్తి మెజార్టీ సాధించని ప్రధాని మోడీ బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలన్నారు. మీ నేతలు మీకు తప్పుడు అంకెలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సారి మోడీ గ్యారంటీ యొక్క వారంటీ ఖతం అయిందన్నారు.