కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపినా బుద్ధి రాలేదు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

by srinivas |
కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపినా బుద్ధి రాలేదు: ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపినా బుద్ధి రాలేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ..కేసీఆర్ చెట్ల కింద కూర్చొని కలలు కంటున్నాడని విమర్శించారు. బాద్ షా సినిమాలో బ్రహ్మానందంలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడన్నారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. లేకుంటే ప్రజలు మరోసారి బొంద పెడ్డారన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వాసం సృష్టించి, ఇప్పుడు కేసీఆర్ నటిస్తున్నాడని మండిపడ్డారు. తాను సీఎం సీటు నుంచి దిగిపోయాక తెలంగాణ ప్రజలు అన్నం, నీళ్లు మానేసి కంటికి ధారలా విలపిస్తున్నారని చంద్రశేఖర్ రావు భ్రమ పడుతున్నాడన్నారు. తమ అధికారం పోగానే రాష్ట్రంలో కరెంటు, నీళ్లు మాయం అయ్యాయని తనకు తాను ఊహించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలిచ్చే బర్రె ను వదిలి జనం దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ బలుపు మాటలు మాట్లాడుతున్నాడని, కానీ తెలంగాణ ప్రజలు ఎందుకూ పనికి రాని దున్నపోతును తన్ని తరిమేసి కామధేనువు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే, తాట తీస్తామని హెచ్చరించారు. కేసీఆర్ తప్పిదాలు తెలిసే జనాలు లోక్ సభ ఎన్నికల్లో జీరో సీట్లకు పరిమితం చేశారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.



Next Story