మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

by Y. Venkata Narasimha Reddy |
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన వృద్దాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాసేపట్లో ఆయన నివాసానికి భౌతిక కాయం చేరుకోనుంది. పురుషోత్తమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం లో జరుగుతాయి. కాగా మంత్రి ఉత్తమ్ కు పితృ వియోగం సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed