- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టుకు మళ్ళీ వరుణుడి బ్రేక్
దిశ, వెబ్ డెస్క్ : భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టుకు మరోసారి వర్షం కారణంగా బ్రేక్ పడింది. మూడో రోజుఉదయం నుంచి వర్షం లేకపోయినా కూడా మైదానం చిత్తడిగా ఉండటం వల్ల పలుమార్లు అంపైర్లు మైదానాన్ని పరిశీలించి మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేదని భావించి ఆటను మళ్లీ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా మైదానం తడిగా ఉండటం వల్ల మ్యాచ్ను మరికొంత సమయం వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి పరిశీలించి ఆట ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. రెండో టెస్టులో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట కొనసాగగా, రెండో రోజు మాత్రం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైంది. ఇక మూడో రోజు కూడా అనుకూల పరిస్థితులు కనిపించట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 107/3 స్కోరుతో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి.
ప్రస్తుత డబ్ల్యూటీసీ టోర్నిలో భారత్ ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో ఏడింట్లో నెగ్గి, 2 టెస్టుల్లో ఓడింది. మరోకటి డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 71.67 శాతం (86 పాయింట్లు) తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12మ్యాచ్ల్లో 8 విజయాలు నమోదు చేసి 62.50 శాతం (90 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత బంగ్లా సిరీస్ తర్వాత 2025 డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో 3 మ్యాచ్లు న్యూజిలాండ్తో, 5 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే బంగ్లా సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్లైతే, మిగిలిన 8 టెస్టుల్లో భారత్ కనీసం 3 మ్యాచ్లు నెగ్గినా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. అదే భారత్ - బంగ్లా టెస్టు డ్రా గా ముగిస్తే, 1-0తో సిరీస్ నెగ్గుతుంది. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే టీమ్ఇండియా తన తర్వాతి 8 టెస్టుల్లో 5 మ్యాచ్లు నెగ్గాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్తో 3, ఆస్ట్రేలియాపై కనీసం 2 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక (50 పాయింట్ల శాతం), న్యూజిలాండ్ (42.86 శాతం) తమ తదుపరి మ్యాచ్ల ఫలితాలపై కూడా భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయని క్రికెట్ నిపుణుల విశ్లేషణ.