అత్యాచారం చేసిన నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు

by Mahesh |
అత్యాచారం చేసిన నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు
X

దిశ, వెబ్ డెస్క్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటి పై గ్రామస్తులు దాడి చేసి.. నిప్పుపెట్టారు. ఈ ఉదిృక్త ఘటన నిజామాబాద్ జిల్లా కొమురవెల్లి మండలం.. గురువన్న పేట లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువన్న పేట గ్రామానికి చెందిన యువకుడు ఎడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు.. అత్యాచారం చేసిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. అలాగే పలు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్థులను చెదరగొట్టారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed