తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్

by Y. Venkata Narasimha Reddy |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆయనకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ చంద్రచూడ్ గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనాలిచ్చారు. టీటీడీ ఈవో ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed