ఆ భారీ ఫ్యాక్టరీని తెరిపించండి.. కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి

by srinivas |   ( Updated:2024-06-28 17:34:49.0  )
ఆ భారీ ఫ్యాక్టరీని తెరిపించండి.. కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామిని ఢిల్లీలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. గత 30 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ లో మూతబడి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమతో వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమను పున: ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed