శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం

by Anjali |   ( Updated:2024-08-26 09:15:17.0  )
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం
X

దిశ,వెబ్‌డెస్క్: నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలంతా దేవాయలయాలకెళ్లి దేవుడ్ని సందర్శించుకుంటున్నారు. తమ తమ భక్తిని వాట్సప్ స్టేటస్‌ల ద్వారా లేదా ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల ద్వారా తెలియపరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు అండ్ సినీ సెలబ్రిటీలు కూడా స్పెషల్‌ గా తెలుగు ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రావాణా, బీసీ సంక్షేమ శాఖ పొన్న ప్రభాకర్ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ 12 లోని ఎన్బీటీనగర్‌లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు క్షేత్రంలోని శ్రీ కృష్ణ ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. నరసింహా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్వామివారిని దర్శించుకున్న ఫొటోలు ట్విట్టర్ వేదికన పంచుకున్నారు. ‘స్థితప్రజ్ఞత, కర్తవ్య నిష్ఠ, ధర్మ పరిరక్షణ, ప్రేమమయ, ఉత్సవభరిత జీవనం.. ఆచరణలో పాటించి, బోధించిన గీతాచార్యుడు.. మానవుడిలోని దైవత్వాన్ని ప్రకటింపచేసిన జగద్గురువు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు..!’ అని రాసుకొచ్చారు.

Ponnam Prabhakar Twitter post : https://x.com/Ponnam_INC/status/1827980990574420355

Advertisement

Next Story

Most Viewed