- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ponguleti Srinivas Reddy : యుద్ధ ప్రతిపాదికన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి : మంత్రి పొంగులేటి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరింత వేగం పెంచాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం సూచించారు. రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం తన నివాసంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మించి ఇవ్వడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యాలకు, ఆలోచనల ప్రకారం కలెక్టర్లు పనిచేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, కాలయాపన చేయకూడదని హెచ్చిరించారు. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక శాసన సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని,ఎంపికలో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సూచించారు.
నిర్మాణం పూర్తి అయిన డబుల్బెడ్రూమ్ఇండ్ల కు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగునీరు, త్రాగునీరుకు ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. వరంగల్ జిల్లాలోని ఎయిర్ పోర్ట్, ఔటఠ్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగురోడ్డు కు భూసేకరణ ను వేగవతం చేయాలని ఆదేశించారు.