Minister Jupalli:బీఆర్ఎస్ పీడ విరగడైంది.. మంత్రి జూపల్లి ఆగ్రహం

by Prasad Jukanti |   ( Updated:2024-09-26 10:38:35.0  )
Minister Jupalli:బీఆర్ఎస్  పీడ విరగడైంది.. మంత్రి జూపల్లి ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనేక మంది ఉద్యమకారులను అవమానించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిన బీఆర్ఎస్ పీడ విరగడైందని మళ్లీ అటువంటిది ఈ రాష్ట్రం దరిదాపులకు కూడా రావొద్దని అన్నారు. గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు గొప్ప గొప్ప స్పీచులు ఇవ్వొచ్చు, గొప్పుగా కవిత్వాలు చెప్పవచ్చు కానీ వారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతన లేకుండా పరిపాలన చేశారని విమర్శించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలంతా కలిసి ముందడుగు వేస్తే ఈ రాష్ట్రం తప్పకుండా బంగారు తెలంగాణ అవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed