మెట్‌పల్లి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

by M.Rajitha |
మెట్‌పల్లి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
X

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బాక వాడలో నివాసముంటున్న లక్ష్మి, రాజుల రెండేళ్ల కుమారుడు శివ తన అక్క అమ్ములుతో కలిసి కిరాణా షాప్ కు వెళ్తున్నాడు. బైక్ మీద వచ్చిన దుండగుడు పాపకు మాయమాటలు చెప్పి బాలుడు శివను ఎత్తుకెళ్ళి పోయాడు. పాప ఏడుస్తూ వెళ్ళి తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు, స్థానికులు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా, దుండగుడు బాలుడిని తీసుకువెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఫుటేజీ ఆధారంగా ఎటు వెళ్ళింది ఆరా తీసిన పోలీసులు, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, నిందితుడి ఆచూకీ తెలిసిన వారు తమకు వెంటనే ఇన్ఫార్మ చేయాలని కోరారు. కొద్ది గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పోలీసులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. రూ.50 వేలకు అమ్మేయడానికి తానే కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకోగా.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. ఎట్టకేలకు సోషల్ మీడియా రెండేళ్ల చిన్నారిని పట్టించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed