- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
శతక్కొట్టిన సాహిల్.. ఆసిస్పై వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత కుర్రాళ్లు
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో నెగ్గిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేలోనూ సత్తాచాటారు. సోమవారం పుదుచ్చేరి వేదికగా జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 జట్టు 9 వికెట్ల తేడాతో ఆసిస్ను ఓడించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతమైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్-19 జట్టు 49.3 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. అడిసన షెరిఫ్(39) టాప్ స్కోరర్. కిరణ్, సమర్థ్, మొహమ్మద్ ఈనాన్ రెండేసి వికెట్ల చొప్పున సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కూల్చేశారు. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 22 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రుద్ర పటేల్(10) నిరాశపర్చగా.. సాహిల్ పరాఖ్(109 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి జట్టు విజయాన్ని సులభం చేశాడు. అభిజ్ఞాన్ కుండు(53 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ జోడీ రెడో వికెట్కు 153 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ నెల 26న మూడో వన్డే జరగనుంది.