విషాదం.. హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కార్మికులు మృతి

by Y.Nagarani |   ( Updated:2024-10-07 09:14:32.0  )
విషాదం.. హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కార్మికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్/మేడ్చల్ టౌన్: విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో శ్రీనివాస్ లాజిస్టిక్ గోదాంలో కంపెనీ షిఫ్టింగ్ కోసం విష్ణు ఎంటర్ ప్రైజెస్ కు చెందిన 6 మంది కార్మికులు ఉపాధికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం పనిచేస్తుండగా కదిలే నిచ్చెన 11కేవీ వైర్ కు తగిలింది. దీంతో పనిచేస్తున్న కార్మికులు ఇద్దరు గుడు బైట(26), పువొ మంజహి (25) అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న సీఎంఆర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story