దేవుణ్ణి కూడా వదలని దొంగలు..

by Sumithra |
దేవుణ్ణి కూడా వదలని దొంగలు..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ వెలుగుటలో శ్రీ మల్లికార్జున భ్రమరాంబ దేవాలయంలో బుధవారం రాత్రి 9.50 నిమిషాలకు దుండగుడు హుండీ తెరవడానికి తాళం పగలగొట్టారు. అక్కడే ఉన్న వాచ్ మెన్ కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయారు. సీసీ ఫుటేజీల్లో చిత్రాలు రికార్డ్ అయ్యాయి. ఆలయ చైర్మన్, ఆలయ క్లర్కు, గుడి పూజారి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నెలరోజుల క్రితం ఇదే ఆలయంలో హుండీ చోరికి గురై లక్ష రూపాయల వరకు దుండగులు దొంగలించారు.

Advertisement

Next Story

Most Viewed