ఈటల నామినేషన్‌కు తేది ఖరారు.. తరలిరానున్న కేంద్ర మంత్రులు

by Disha Web Desk 23 |
ఈటల నామినేషన్‌కు తేది ఖరారు.. తరలిరానున్న కేంద్ర మంత్రులు
X

దిశ,మేడ్చల్ టౌన్ : మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్న ఆయన మొదటి రోజే నామినేషన్ వేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈటల నామినేషన్ కు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్, కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. 6వేల మందితో బైక్ ర్యాలీ, 10 వేల మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మేడ్చల్ మండలం పూడూరు గ్రామ శివారులో రింగ్ రోడ్డు పక్కన ఉన్న ఈటల ఇంటి నుంచి ఉదయం బైక్ ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. నామినేషన్ ముందు 10 వేల మందితో సభ నిర్వహిస్తున్నారు. బైక్ ర్యాలీ, సభ నిర్వహణకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను జనాన్ని సమీకరించే పనుల్లో ఈటల అనుచరవర్గం నిమగ్నమైంది. ఇప్పటికే ప్రచారంలో, వివిధ పార్టీల నాయకులను పార్టీలో కలుపుకోవడం తో చురుగ్గా ఉన్న ఈటల మొదటి రోజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసి, తన పట్టును ప్రదర్శించాలని భావిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ వేసేందుకు ఈటల రాజేందర్ సిద్ధమయ్యారు.

Next Story