అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన కలెక్టర్ గౌతమ్..

by Sumithra |
అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన కలెక్టర్ గౌతమ్..
X

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం 10.30కు దుండిగల్ మున్సిపాలిటీకి వచ్చిన ఆయన దుండిగల్ గ్రామంలోని అంగన్వాడీ-3, బహదూరపల్లి అంగన్వాడీ సెంటర్లను సందర్శించి పౌష్టికాహారం పంపిణీ, బాలింతలు, పిల్లలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇస్తున్నారు లేదా అని అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ సమీపంలోని ఓల్డేజ్ హోమ్ భవనాన్ని సందర్శించారు.

భవనం ఖాళీగా ఉండడంతో బాల్ రక్ష భవన్, సఖి సెంటర్, ఓల్డేజ్ హోమ్ కు కేటాయించేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల పనితీరును పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణా రెడ్డి, డిస్ట్రిక్ సీపీడీఓ శారద, గండిమైసమ్మ మండల స్పెసెల్ ఆఫీసర్ బాబు మోజెస్, మండల తహశీల్దార్ అబ్దుల్ సయ్యద్ మతిన్, మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణ రావు, దుండిగల్ అంగన్వాడీ ఇంచార్జ్ శోభారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

Advertisement

Next Story