Terrorist killed: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం

by vinod kumar |
Terrorist killed: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లోని అఖ్నూర్ సెక్టార్‌లో భారత భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలంలో ఓ ఆయుధంతో పాటు టెర్రరిస్టు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో పలువురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని భట్టల్ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో వాహనం స్వల్పంగా దెబ్బతినగా.. జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారు. అనంతరం టెర్రరిస్టులు అఖ్నూర్ ప్రాంతంలోని అడవిలోకి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ (Search Opration) నిర్వహించింది. ఈ క్రమంలోనే ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. సుమారు 5 గంటల పాటు ఉగ్రవాదులు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఆదివారం రాత్రి సరిహద్దు దాటి అఖ్నూర్‌కు వచ్చినట్లు సమాచారం. అంతకుముందు ఈ నెల 24 న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయగా.. ఇందులో ముగ్గురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed