మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం: కేంద్ర మంత్రి సర్బానంద

by Mahesh |   ( Updated:2024-10-28 12:57:18.0  )
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం: కేంద్ర మంత్రి సర్బానంద
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) కూటమి విజయం సాధిస్తుందని.. కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ (Union Minister Sarbananda Sonowal) ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని గౌహతి ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో విజయం సాధిస్తామన్నారు. అలాగే హర్యానా(Haryana) ఎన్నికల అంచనా వేరుగా ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు బీజేపీ(BJP)కి ఓట్లు వేసి అధికారంలో కొనసాగిస్తారని అన్నారు. ప్రధాని మోడీ(PM modi) సమర్థ నాయకత్వం కారణంగానే మనం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని.. అంతకుముందు 11వ స్థానంలో ఉన్నామని అన్నారు. అలాగే దేశ వృద్ధి వేగం పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed