భూసారానికి అనుగుణంగా పంటలు వేయాలి

by Sridhar Babu |
భూసారానికి అనుగుణంగా పంటలు వేయాలి
X

దిశ, శామీర్ పేట : భూసారానికి అనుగుణంగా పంటను వేయాలని, తద్వారా అధిక దిగుబడిని పొందవచ్చని ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ పుష్పజిత్ చౌదరి అన్నారు. లారస్ ల్యాబ్స్, ఇక్రిశాట్ (పటాన్​చెరు) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని రైతుల పొలాల్లో భూసార పరీక్ష నిర్వహించి గురువారం ఫలితాలను రికార్డు రూపంలో రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకొని భూసారానికి అనుగుణంగా ఎరువులను ఉపయోగించాలని వివరించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ రంగనాథ్, ఏడీఏ వెంకటరామిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవి, చేతన, లక్ష్మారెడ్డి, లావణ్య, పోచమ్మ, మహేందర్, నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శిల్పా యాదగిరి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed