అభివృద్ధికి అధికారుల సహకారం అవసరం : ఎమ్మెల్యే శ్రీ గణేష్

by Aamani |
అభివృద్ధికి అధికారుల సహకారం అవసరం : ఎమ్మెల్యే శ్రీ గణేష్
X

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: కంటోన్మెంట్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. శని వారం బొల్లారం లోని బాబా సాహెబ్ అంబేద్కర్ యువ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అభివృద్ధి చేయడానికి అధికారుల సహకారం అవసరమన్నారు.. నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అధికారులు కూడా నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి అధికారులు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని సూచించారు. అదేవిధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ యువ సంఘం కమ్యూనిటీ హాల్ ను సంఘం అభ్యర్ధన మేరకు అన్ని హంగులతో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఆలయాలకు నిధులు..

కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఎనిమిదో వార్డు బొల్లారం సదర్ బజార్ లోని మహంకాళి దేవాలయంలో పరిధిలో అన్ని దేవాలయాల కమిటీ సభ్యుల సమావేశానికి హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.రానున్న బోనాల జాతర దృష్ట్యా అన్ని ఆలయాలకు నిధులు అందేలా కృషి చేస్తానని అన్నారు.

Next Story

Most Viewed