ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం..

by Aamani |
ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం..
X

దిశ,కాగజ్ నగర్ : కుటుంబంలో తరచూ కలహాలను భరించలేక ఆవేదన చెంది ముగ్గురు కూతుర్లకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గజ్జి గూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గజ్జి గూడ గ్రామానికి చెందిన చిలుకూరి. అనిత 45 సంవత్సరాలు. భర్త చిలుకూరి ప్రతాప్ లకు 5 కుమార్తెలు సంతానం పెద్ద కూతురు వివాహం జరగగా హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. కాగా గత రెండు సంవత్సరాల నుంచి భర్త ప్రతాప్ తప్ప తాగి ఇంట్లో తరచూ గొడవకు దిగేవాడని దీంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు దీంతో మనస్థాపానికి గురైన భార్య సోమవారం భర్త మళ్లీ ఇంటికి తాగి రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తన నలుగురు కూతుర్లతో గ్రామ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లి పురుగుల మందును కూతుళ్లు లక్ష్మి 21. వైష్ణవి 16. ఐశ్వర్య 14. తల్లి అనిత 45. తాగాలని చెప్పగా భయంతో రెండో కూతురు అయిన రవళి 19 సంవత్సరాలు నేను మందు తాగనని తల్లికి చెప్పి అక్కడి నుంచి గ్రామానికి పరుగెత్తుకొచ్చి తల్లితోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు పురుగుల మందు తాగినట్లు గ్రామస్తులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఇస్గాం ఎస్సై రామన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల నుండి వివరాలను సేకరించి సమాచారాన్ని సీఐ అల్లం రాంబాబుకు సమాచారం తెలపడంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులతో పాటు వైద్యులతో మాట్లాడి బాధితుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం నలుగురి లో లక్ష్మి 21 సంవత్సరాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు. ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రతాప్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed