చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ఎకరా టమాటా పంట ధ్వంసం

by srinivas |
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ఎకరా టమాటా పంట ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కె.గొల్లపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించారు. అటవీ ప్రాంతం నుంచి రవి అనే రైతు పంట పొలం వైపు వెళ్లాయి. ఎకరం టమాటా పంటపై దాడి చేశాయి. పొలమంతా తిరుగుతూ తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో రైతు రవి లబోదిబో మంటున్నారు. మంచి ధర నడుస్తున్న సమయంలో పంట నాశనం కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఏనుగులు పంట పొలాలు వైపు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏనుగుల దాడిలో టమాటా పంట నష్ట పోయిన తనను ఆదుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed