కోతులను కొట్టేందుకు వెళ్లిన బాలుడికి కరెంట్​ షాక్​

by Sridhar Babu |   ( Updated:2024-07-05 12:12:37.0  )
కోతులను కొట్టేందుకు వెళ్లిన బాలుడికి  కరెంట్​ షాక్​
X

దిశ, ఖమ్మం రూరల్ : రూరల్ మండలం పెద్ద తండా గ్రామ పరిధిలో గల శ్రీ సాయి గణేష్ నగర్ కాలనీలో 33కేవీ హై టెన్షన్ విద్యుత్ వైర్ వలన ఓ బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 14 లో మెయిన్ రోడ్డు పక్కన గల బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్న మధు రెడ్డి కి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం కోతులు వచ్చాయి

అని వాటిని కొట్టడానికి ఇల్లు తుడుచుకునే కర్రతో బిల్డింగ్ పైకి ఎక్కి కోతులను కొట్టే క్రమంలో ఆ కర్ర హై టెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి బాలుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. బాలుడు శరీరం 70 శాతం కాలిపోయింది. అక్కడే ఉన్న కాలనీవాసులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed