- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశ రక్షణ బీజేపీకే సాధ్యం
దిశ, జగదేవ్ పూర్ : దేశ రక్షణ భారతీయ జనతా పార్టీకే సాధ్యమని, కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీని ప్రజలు గెలిపించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలను నమ్మొద్దని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ అన్నారు. గురువారం రాత్రి సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని చాట్లపల్లి మునిగడప, గొల్లపల్లి గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించి జగదేవ్ పూర్ లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జగదేవ్ పూర్ లో కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి
వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఫేక్ వీడియోలతో రీసెంట్ రిజర్వేషన్ల రద్దులాంటి అబద్దాలను కాంగ్రెస్ ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ను ఫాంహౌస్ కు పరిమితం చేసిన విధంగా వెంకట్ రాంరెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడే తనను కమలం పువ్వుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి, గురువారెడ్డి, శ్రీనివాస్, నందన్ గౌడ్, కప్పర ప్రసాద్ రావు, మండల అధ్యక్షుడు దాసరి ఐలయ్య యాదవ్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు శ్రీధర్ గణేష్, రాములు రాజు, మల్లేశం మహిళలు పాల్గొన్నారు.