మెడికల్ కళాశాల మంజూరు సంతోషదాయకం.. మున్సిపల్ చైర్మన్

by Sumithra |   ( Updated:2024-09-11 12:37:38.0  )
మెడికల్ కళాశాల మంజూరు సంతోషదాయకం.. మున్సిపల్ చైర్మన్
X

దిశ, మెదక్ టౌన్ : మెదక్ మెడికల్ కళాశాల అనుమతులు పొంది, ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి, టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ టపాకాయలు కాల్చి, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు.

మెదక్ మెడికల్ కళాశాల మంజూరులో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి ఎంతో ఉందన్నారు. మెదక్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హాఫీజ్ ఉద్దీన్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, బొజ్జ పవన్, జీవన్ రావు, దొంతి ముత్యం గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మధుసూదన్ రావు, కౌన్సిలర్స్ అవారి శేఖర్, లక్ష్మీనారాయణ గౌడ్, సమీయుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed