Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది మృతి

by Shamantha N |
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పై దాడి చేసిన కొన్నిగంటలకే గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఆరు భవనాలపై ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 35 మంది చనిపోయారు.అదేవిధంగా ఓ ఇంటిపై జరిగిన మరో దాడిలో 10 మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.

దాడులను ధ్రువీకరించిన ఐడీఎఫ్

ఇకపోతే, ఇజ్రాయెల్ దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (CAIR) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది. దాడులు జరిగినట్లు ఐడీఎఫ్‌ కూడా ధ్రువీకరించింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా ఈ దాడులు చెసినట్లు తెలిపింది. మరోవైపు.. ఈ దాడులను జోర్డాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ‘ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనే. అమాయక పౌరుల లక్ష్యంగా దాడులు చేయడం దారుణం’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొంది. మరోవైపు బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాల్లోని రెండు భవానాలను ఖాళీ చేయాలని లెబనియన్లకు ఇజ్రాయెల్ దళఆలు సూచించాయి. ఆ ప్రాంతంలోనే దాడులు చేయనున్నట్లు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed