బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Nagam Mallesh |
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రం శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద శంకరంపేటకు చెందిన విలాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిజాంపేట్ శివారులో మూలమలుపు వద్ద యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొనడంతో పెద్ద శంకరంపేటకు చెందిన విలాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలుగా అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విలాస్ మృతి పట్ల పెద్ద శంకరంపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి

Next Story

Most Viewed