Irrigation Officers : ఇరిగేషన్ కార్యాలయంను సందర్శించిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మ

by Sridhar Babu |
Irrigation Officers : ఇరిగేషన్ కార్యాలయంను సందర్శించిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్  ధర్మ
X

దిశ, జహీరాబాద్ : నీటి పారుదల శాఖ సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ ధర్మ, సూపరింటెండెంట్ ఇంజనీర్ యేసయ్యలు శుక్రవారం జహీరాబాద్ ఇరిగేషన్ కార్యాలయంను సందర్శించారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ధర్మ, యేసయ్య లు మొట్ట మొదటి సారిగా జహీరాబాద్ కార్యాలయాన్ని సందర్శించారు. స్థానిక అధికారులతో స్టాఫ్ పనితీరు, ఇరిగేషన్ ప్రతిపాదనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అంతకు ముందు ఝరాసంగం మండలం ఏడాకులపల్లి కొత్తూరు వాగు ప్రాజెక్ట్, రాయికోడ్ మండలం ఇందూర్ లోని బొగ్గులంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, జహీరాబాద్ మండలం కొత్తూరు లోని నారింజ ప్రాజెక్ట్, కోహిర్ మండలం గోటిగార్పల్లి లోని పెద్ద వాగు ప్రాజెక్ట్ లను సందర్శించారు. స్థానిక అధికారులు పంపిన ప్రతిపాదనల మేరకు వారు తనిఖీలు నిర్వహించారు.



Next Story