- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అటవీ హద్దులు నిర్ధారించాలి : మనుచౌదరి
![అటవీ హద్దులు నిర్ధారించాలి : మనుచౌదరి అటవీ హద్దులు నిర్ధారించాలి : మనుచౌదరి](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348309-29.webp)
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 23738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాల్లో కలదన్నారు. అటవీ హద్దులను నిర్ధారించుటకు మరి ఆక్రమణల తొలగించుటకు అటవీ రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే పూర్తి చేయాలని అన్నారు.
పెండింగ్లో ఉన్న అటవీ బ్లాక్ లను తగినట్లు నోటిఫై చేయుటకు వివాదాలను తొందరగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ రికార్డులలో అటవీ బ్లాక్ లను చేర్చాలని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు, వేసవికాలంలో మంటల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఫారెస్ట్ రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.