- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలి : కలెక్టర్
![రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలి : కలెక్టర్ రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలి : కలెక్టర్](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347373-4.webp)
దిశ, ములుగు: రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ములుగు లోగల ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గల మూడు నర్సరీలలో 8 లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు 11,108 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగిందని అలాగే ఈ సంవత్సరం మరో 4 వేల మొక్కలను నాటేందుకు నిర్దేశించడం జరిగిందన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం అయినందున ఆయిల్ ఫామ్ రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ హార్టికల్చర్ అధికారులకు సూచించారు. అలాగే మొక్కలు సిద్ధంగా ఉన్నందున త్వరగా నాటుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ శంకర్, ములుగు నర్సరీ ఇంచార్జ్ శ్రీకర్, హార్టికల్చర్ అధికారులు అనిల్, సౌమ్య ఉన్నారు.