మెదక్ కు మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే.. ఎమ్మెల్యే

by Sumithra |
మెదక్ కు మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే.. ఎమ్మెల్యే
X

దిశ, నిజాంపేట : గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు రామాయంపేట మండల కేంద్రంలో గల స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలానికి సంబంధించిన 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

నిరుపేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. రాబోవు రోజుల్లో మరిన్ని నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. అనంతరం మండల కేంద్రంలో గల స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయికి క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాత రావు, యాదగిరి, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed