- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Home > జిల్లా వార్తలు > మెదక్ > వరదల్లో చిక్కుకున్న కార్మికులు.. రెస్క్యూ చేసి రైతు వేదిక వద్దకు తరలించిన ఏసిపి
వరదల్లో చిక్కుకున్న కార్మికులు.. రెస్క్యూ చేసి రైతు వేదిక వద్దకు తరలించిన ఏసిపి
X
దిశ, హుస్నాబాద్: బుధవారం కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద బ్రిడ్జి పనులు చేస్తున్న 8 మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పోలీస్ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో ఐదు కుటుంబాలకు చెందిన 8 మందిని రెస్క్యూ చేసి బస్వాపూర్ రైతు వేదిక వద్దకు తరలించినట్లు తెలిపారు. బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగుకు ఇరువైపులా బ్లాక్ చేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరు కూడా ఆ వాగు ప్రదేశానికి, దరిదాపుల్లోకి కూడా రావొద్దని ఏసీపి ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Next Story