వ్యక్తిని చెట్టుకి కట్టి దేహశుద్ది చేసిన డ్వాక్రా గ్రూప్ సభ్యులు..

by Sumithra |
వ్యక్తిని చెట్టుకి కట్టి దేహశుద్ది చేసిన డ్వాక్రా గ్రూప్ సభ్యులు..
X

దిశ, తూప్రాన్ : డ్వాక్ర గ్రూప్ లో లోన్ తీసుకుని కట్టలేదని వ్యక్తిని చెట్టుకి కట్టేసి కొట్టిన ఘటన మంగళవారం రాత్రి తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడలపల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కనుకుంట బిక్షపతి అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలిపారు. భార్య డ్వాక్రా గ్రూప్ లో లోన్ తీసుకోగా గత 8 నెలల క్రితం కుటుంబ కలహాలతో భర్తను, ఊరును విడిచి హైదరాబాద్ కి వెళ్లిందని తెలిపారు.

మంగళవారం 10వ తేది కావడంతో గత కొన్ని రోజుల ముందు నుండే డబ్బులు కట్టాలని వేధిస్తున్నారని తెలిపారు. రాత్రి భార్య మిన్ని ఊరిలోకి రావడంతో ఇంటిని కొంతమంది చుట్టు ముట్టి భర్త బిక్షపతిని చెట్టుకు కట్టేసి కొట్టారని తెలిపాడు. ఆ సమయంలో భార్య వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి దాక్కుందని అన్నారు. ఆ డబ్బుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. అయినా తనను బాధ పెడితే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed