డబ్బుల విషయంలో గొడవ.. చివరికి సూసైడ్

by Vinod kumar |
డబ్బుల విషయంలో గొడవ.. చివరికి సూసైడ్
X

దిశ, మెదక్ ప్రతినిధి: డబ్బుల విషయంలో బార్య, భర్తలు మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ మండలం రాజ్ పల్లిలో బుదవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాజ్ పల్లికి చెందిన తుడుం ప్రశాంత్(26) తనకు ఉన్న వ్యవసాయ భూమిని విక్రయించారు. అందులో వచ్చిన డబ్బులు కొంత అప్పు తీర్చి అందులో మిగిలిన డబ్బులు వడ్డీకి బార్య పుట్టింట తెలిసిన వారికి ఇచ్చాడు. డబ్బులు ఆసరం ఉండడం తో అప్పు ఇచ్చిన డబ్బుల కోసం వెళితే డబ్బుల విషయం తో గొడవ జరిగింది.

దీనితో పాటు బార్య కాపురానికి సైతం రావడం లేదు. అక్కడ గొడవ జరిగిన తరవాత స్వగ్రామం వచ్చిన ప్రశాంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అయిన ప్రశాంత్ తలుపులు వేసి ఉండడం తో అనుమానం వచ్చి చూడగా.. దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed